- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేసీఆర్, కేటీఆర్ మత్తు వదిలి రైతుల గురించి పట్టించుకోవాలి.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్, కేటీఆర్ మత్తు వదిలి రైతుల గురించి పట్టించుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో రైతు ఉత్పత్తి దారుల కంపెనీని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్ సంఘం సభ్యుల సహకారంతో గోదామును ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆర్గానికి వ్యవసాయంపై రైతులు దృష్టిపెట్టాలని కోరారు. అకాల వర్షాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారన్న ఎంపీ.. కేసీఆర్ మాత్రం రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భారీ వర్షాలకు వడ్లు మొలకెత్తాయని, నష్టపోయిన రైతులకు రూ.10 వేల నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ హామీలకే పరిమితమయ్యారే తప్ప అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని వెంటనే నెరవేర్చాలని సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు మనసుంటే.. మార్గం నేను చూపిస్తా : ఎంపీ ధర్మపురి అరవింద్